దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమనని అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి …
Read More »దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు
ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. కోలుకున్న వారు 2,93,09,607 మంది కాగా.. యాక్టివ్ కేసులు 5,72,994గా ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 3,96,730 మంది మరణించారు. రికవరీ రేటు 96.8 శాతానికి చేరింది.
Read More »పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.
మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా …
Read More »చెరువుల్లోకి మురుగునీరు పోకుండా ప్రత్యేక ట్రంక్ లైన్-మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీకి రూ.800 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. చెరువులు, ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ కోమటికుంట, పోచమ్మకుంట సుందరీకరణ పనులకు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని …
Read More »అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎంతో తెలుసా..?
అప్పుడేప్పుడో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చందమామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజల్ మగధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగానే ఉంది. ఈ క్రమంలో ఆస్తులు బాగానే కూడబెట్టింది.కాజల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా …
Read More »‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్
నమస్కారం.. ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు …
Read More »సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధిగా వ్యయం చేసేందుకు ప్రతి రాష్ట్ర మంత్రికి రెండు కోట్లు, ప్రతి జిల్లా కలెక్టర్కు కోటి రూపాయలను కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.అత్యవసర సమయాల్లో వ్యయం చేయడానికి రాష్ట్ర మంత్రులకు, జిల్లా కలెక్టర్లకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన …
Read More »హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా హన్మకొండలోని కాకాజీ కాలనీలో GLS డెంటల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం..హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో సామాన్య ప్రజలకు మెరుగైన దంతవైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో GLS డెంటల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని Dr. శేషుకుమార్, Dr. రోహిణి దంపతులు స్థాపించారు.. హన్మకొండ …
Read More »దళితులకు నాడు దగా.. నేడు ధీమా
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దళితులను రాజకీయంగా, ఓటు బ్యాంకుగా చూశారే తప్ప.. వారిని సాటి మనుషులుగా చూసిన సందర్భం లేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా దళితులకు అన్యాయమే జరిగింది. నాడు ఇక్కట్లు పడిన దళితులు స్వరాష్ట్రంలో సగర్వంగా, ఆర్థిక స్వావలంబనతో సాధికారత సాధించేలా కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పించారు. ఇందుకోసం ఏది చేయడానికైనా, ఎంత ఖర్చు చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. గత ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం …
Read More »మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి …
Read More »