భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ రూపంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అయి రాత్రి 9.30 వరకు కొనసాగుతుంది. మొతేరాలో తొలి డే అండ్ నైట్ టెస్టు ఇదే కావడం విశేషం. ఈ వేదికపై 2012లో జరిగిన చివరి టెస్టులో.. ఇవే జట్లు తలపడ్డాయి. అప్పుడు పుజార డబుల్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. ఇప్పటిదాకా జరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో …
Read More »ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్
ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.
Read More »తెలంగాణలో ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారం
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది మార్చి 8 నుంచి కరోనా కేసుల సమాచారాన్ని అందజేస్తుండగా.. మంగళవారం నుంచి సమాచారాన్ని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు తెలిపారు. కొంత కాలంగా కరోనా ఉద్ధృతి తగ్గడం, కేసుల నమోదులో పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల అధికారులను టీకా కార్యక్రమంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారాన్ని విడుదల చేస్తామన్నారు.
Read More »మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?
ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …
Read More »నేటి నుండి తెలంగాణలో 6,7,8 తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి 6,7,8 తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6,7,8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రారంభించుకోవచ్చని మంత్రి సూచించారు. 6,7,8 తరగతుల ప్రారంభోత్సవంపై బుధవారం విద్యా శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా …
Read More »సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ ముఖాముఖి -మీకోసం
కరోనా కారణంగా వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. మార్పులను కొనసాగిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యసేవల రంగంలో ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గిస్తూ, రోగులకు ప్రయోజనం చేకూర్చేలా కృత్రిమ మేధ, హాలోగ్రామ్ వంటి టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచించారు. బయోఏషియా-2021 సదస్సు రెండోరోజు ‘హెల్త్కేర్ టు హిట్ రిఫ్రెష్’ అంశంపై చర్చలో సత్య నాదెళ్ల, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే …
Read More »నేడు మహబూబ్నగర్కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తండ్రి నారాయణగౌడ్ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా మహబూబ్నగర్కు వెళ్లనున్నారు. ఆదివారం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు.
Read More »తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికి రోల్ మోడల్
దళిత గిరిజనుల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మూడేండ్ల క్రితం (2018) సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు అంకురార్పణ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్గా, బోయిళ్ల విద్యాసాగర్, ముదావత్ రాంబాల్నాయక్, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది. అనేక సమస్యలను మూడేండ్లలోనే కమిషన్ పరిష్కరించింది. ఫిర్యాదుల పరిష్కారంలో నూతన …
Read More »అనుపమకు లక్కీ ఛాన్స్
`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో …
Read More »హిందీలోకి ఉప్పెన రీమేక్
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్రభజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్లర్లేదు. 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషలలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తమిళంలో విజయ్ తనయుడు సంజయ్ రీమేక్ చేయనున్నాడని ఇటీవల వార్తలు …
Read More »