టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ …
Read More »పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …
Read More »హెల్త్ హబ్గా తెలంగాణ
తెలంగాణ హెల్త్ హబ్గా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కల్సిన కృష్ణకాంత్
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్కు పదోన్నతి లభించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కృష్ణకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కృష్ణకాంత్కు పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు.
Read More »‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ …
Read More »శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో …
Read More »దేశానికే దారిచూపే టార్చ్ బేరర్గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, సింగరేణి సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో …
Read More »దుర్మార్గులు మళ్లీ వస్తే రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ : సీఎం కేసీఆర్
గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. …
Read More »నాడు చీకట్లు -నేడు వెలుగు జిలుగులు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించనున్నారు. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో …
Read More »ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం
శ్రీశ్రీశ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది. సంఘం ప్రముఖులు సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో ఎంపీ రవిచంద్రను కలిసి ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రముఖులు …
Read More »