శ్రీశ్రీశ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది.
సంఘం ప్రముఖులు సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో ఎంపీ రవిచంద్రను కలిసి ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రముఖులు బద్దం విష్ణు,బద్దం మహేష్,ఆకుల రవి,బద్దం మధు,బద్దం కిరణ్ కుమార్,ఆకుల చంటి,బద్దం రవి,ఆకుల నర్సింహులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించారు.