మనలో చాలా మందికి పొద్దున్నే టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. ఇడ్లీనో, దోశనో, వడనో పూరీనో..ఇలా రోజుకో రకం టిఫిన్ చేస్తుంటాం. డాక్టర్లు కూడా మార్నింగ్ అల్పాహారం తీసుకోకపోతే.. ఫ్యూచర్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంటారు. అందుకే మన రోజువారీ అల్పాహారంలో ఇండ్లీ, వడ, దోశ, పూరీ భాగం అయిపోయాయి. చాలా మంది భోజన ప్రియులు పొద్దునే ఓ రెండు ఇడ్లీలు ఓ రెండు వడలు , లేకుంటే ఓ మసాల దోశ కొబ్బరి చట్నీ లేదా పల్లీచట్నీకి తోడుగా అల్లం పచ్చడి, సాంబారుతో ఫుల్లుగా లాగిస్తారు. ఆ తర్వాత టీ, కాఫీలు తీసుకుంటారు. అయితే ఈ టిఫిన్స్, టీ, కాఫీల వల్ల మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నట్లు న్యూట్రిషన్స్ అంటున్నారు. ఇలా డైలీ పొద్దునే లేవగానే ఇడ్లీ, వడ, దోశ, పూరీలు టిఫన్గా తీసుకుంటే క్రమంగా డైజేషన్ సిస్టమ్ దెబ్బతింటుందని..అది క్రమంగా ఎసిడిటీకి, అల్సర్కు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీ, దోశ, వడలకు వాడే మినపప్పులో ఉండే క్యాలరీల వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ను పెంచుతాయి. ఏళ్ల తరబడి ఇవి తీసుకుంటే..క్రమంగా షుగర్ వ్యాధికి దారి తీస్తుందని తెలుస్తోంది. ఇలా నిత్యం టిఫిన్లు చేస్తే పేగులు తమ శక్తిని కోల్పోయి జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు, వాతం, కీళ్లవ్యాధులు వస్తాయని ఓ పరిశోధనలో తేలిందంట. అందుకే పొద్దున్నే అల్పాహారంలో ఈ ఇడ్లీ, వడ, దోశ, పూరీలకు బదులుగా పెరుగన్నం..అదీ రాత్రి మిగిలిపోయిన చద్దన్నంతో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇంకా మొలకెత్తిన గింజలు, పండ్లు, డేట్స్ వంటి అలవాటు చేసుకుంటే..బెటర్. .కాకపోతే అసలు టిఫిన్లు తినలేక ఉండలేని వారు..వారంలో రెండు సార్లకు అదీ పరిమితంగా తీసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు. చూశారుగా.. ఇడ్లీ ఆయిల్ఫుడ్ కాదు..హెల్త్కు మంచిదంటూ తెగ లాగించే అల్పాహార ప్రియులు కూడా ఇక నుంచి జాగ్రత్తపడాల్సిందే. డైలీ టిఫిన్స్ మానేసి…ఫ్రూట్స్, స్పౌట్స్ తింటే..అల్పాహారంగా తీసుకుంటే కలకాలం ఆరోగ్యం ఉంటారు. ఏమంటారు.