దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ కేసులో నిందితులకు డెత్ వారెంట్ ఇవ్వాలంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టులో బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు.
దీనిని ఈ రోజు శుక్రవారం విచారించిన కోర్టు కేసును ఈ నెల పద్దెనిమిదో తారీఖుకి వాయిదా వేసింది.దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ” నిందితులకు శిక్ష విధించాలని ఏడేళ్ళుగా పోరాటం చేశాము.
మరో ఆరు రోజులు నిరిక్షీస్తాం. ఇన్నేళ్ళు ఆగిన మేము ఆరు రోజులు ఆగలేమా..?. నిందితులకు కోర్టు డిసెంబర్ పద్దెనిమిదిన డెత్ వారెంట్ ఇవ్వాలని”ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.