Home / NATIONAL / కరోనా యాప్ ను ప్రారంభించిన కేంద్రం

కరోనా యాప్ ను ప్రారంభించిన కేంద్రం

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది.

అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఎవరైనా ఓ వ్యక్తి కరోనా సోకిన వ్యక్తితో తిరిగి ఉంటే తనకు ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందేమో ఆరోగ్య సేతు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్ సహా 11 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తొలుత వారి మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వినియోగదారులు ఉన్న ప్రదేశం ఆధారంగా వారు సురక్షితమైన ప్రదేశంలో ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat