ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు .
నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకు ఆగ్రహించిన టీటీడీపీ అధిష్టానం మోత్కుపల్లిని బహిష్కరించారు.అయితే తనను పార్టీ నుండి తప్పించడం గురించి ఈ రోజు సోమవారం మోత్కుపల్లి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దళిత ద్రోహి.మోసగాడు . చంద్రబాబు ఎన్టీఆర్ ను నమ్మించి వెన్నుపోటు పొడిచి చంపాడు.అతనిపై దాడికి దిగితే నేనే దగ్గర ఉండి బాబును కాపాడాను.అలాంటి పిరికిపంద అయిన చంద్రబాబు నన్ను ఈ రోజు మోసం చేశాడు అని వాపోయారు ..