టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును చంపడమే కాకుండా ఆయన అనుచరులు 20 మందిని కూడా బాధకు గురి చేసి, కుంగి కుశించి మరణించేలా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా ,ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు కుట్రపూరితుడని తెలియక నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలిచి మరీ టీడీపీ టిక్కెట్ ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారన్నారు. చివరకు ఆయనపై చెప్పులు వేయించి తీవ్ర మనస్థాపానికి గురి చేశారన్నారు. అలా మనస్థాపంతో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా.. ఆయన అనుచరులు కూడా మృతి చెందారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మోత్కుపల్లి నర్సింహులు తేల్చి చెప్పారు.
అలాగే, ఇటీవల కాలంలో మృతి చెందిన టీడీపీ నేత గాలి ముద్దుమ కృష్ణ నాయుడు మృతికి కూడా సీఎం చంద్రబాబే కారణమని చెప్పారు. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి సేవలు అందిస్తున్న గాలి ముద్దు కృష్ణమ నాయుడును చులకనగా చూస్తూ చంద్రబాబు అవమానించారన్నారు. ఆ అవమానాన్నే భరించలేక గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతి చెందారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.