Home / 18+ / ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..

ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు. శ్రీనివాస్ తరఫున న్యాయవాది మట్టా జయకర్‌ ప్రశ్నించారు. అలాగే ఈ కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో స్టే వేసింది.

అయితే ఎన్ఐఏ విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇకపోతే ఈ అంశం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో ఈకేసును సుప్రీంకోర్టులో విచారించాలంటూ జగన్ తరపు న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. విచారణ ఈనెల 30కి వాయిదా వేసినప్పటికీ ఇంతలోనే ఎన్ఐఏ దూకుడు ప్రదర్శించి చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలాగే జగన్ పై దాడి చేసిన నిందుతుడు శ్రీనివాసరావు తనకు బెయిల్ సిద్ధం చేయాలని కోరాడు. శ్రీనివాసరావు న్యాయవాది మాత్రం అతను బయటకు వస్తే ప్రాణహాని ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో రాజమండ్రి సబ్ జైలులో నిందితుడి శ్రీనివాస్ ను, తరువాత లంక గ్రామంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులను న్యాయవాదులు సలీం, మట్టా జయకర్ కలిసారు.. అయితే శ్రీనివాసరావు తరపు వాదనలు వినిపిస్తున్న మట్టా జయకర్ ఎవరో తెలుసా.? ఈ వ్యక్తి సీఎం చంద్రబాబు వర్గంలో అత్యంత కీలకసభ్యుడు.. తాజాగా చంద్రబాబుతోపాటు ప్రత్యేక విమానంలో టీడీనపీ నేతలతో కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళాడు.. అలాగే ఈయన చంద్రబాబు సన్నిహితుడైన లగడపాటి రాజగోపాల్ కి కూడా ముఖ్య అనుచరుడు.. ఒకవైపు కేంద్ర సంస్థలతో దర్యాప్తు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం.. మరోవైపు చంద్రబాబుతో మట్టా జయకర్ కలిసి తిరగడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat