ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
ఈ క్ర్తమంలో టీడీపీ తాజా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ “ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీను గెలిపించే అంశాలు ఎంటో” వివరించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొత్తం నూట ఆరు పథకాలను ప్రవేశపెట్టారు.పలు ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేశారు.
అయిన కానీ ప్రజలు ఆదరించలేదు”. కానీ ఇటీవల ప్రవేశ పెట్టిన పసుపుకుంకుమ ,పెంచిన పెన్షన్లే తమ పార్టీను అధికారంలోకి తీసుకువచ్చి.. బాబును తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాయని”ఆయన అన్నారు. అయితే ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలలో వైసీపీదే అధికారమని తేలిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో యువత,మహిళలు,రైతులు,వృద్ధులు ఎక్కువగా పోలింగ్ లో పాల్గోన్న సంగతి కూడా తెల్సిందే..