వైసీపీ అధినేత ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. కాగా గవర్నర్తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నారు.
