ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో
చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి
ఎటువంటి పరిస్థితుల్లో అయిన సరే తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని బయటకు కన్పించకుండా చూస్తాడు. అలాంటి ధోనీ కివీస్ తో మ్యాచ్లో రన్ ఔటై పెవిలియన్ కు వెనుదిరిగే సమయంలో ధోనీ దాదాపు
ఏడుస్తున్నంత స్థ్తితిలో కన్పించాడు. అయితే తన కేరీర్లోనే చివరి మ్యాచ్ గా భావిస్తున్న తరుణంలో ధోనీ ఇలా కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ కలచివేసింది.
