ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు చేసిన అబద్దపు ప్రచారాల వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను మెచ్చుకోకున్నా ఫర్వాలేదు గానీ.. ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పిల్లల మధ్యాహ్న భోజనం, బాలికల సైకిళ్లు, చివరకు స్కూల్ విద్యార్థులకు ఇచ్చే బూట్లలో కూడా తెలుగు దొంగల పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారు. బాబు గారి పాలనలో బందిపోట్ల దోపిడీ లేని పథకమే లేదని ఎద్దేవా చేసారు. వీళ్లందరి నేరాలు రుజువైతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవేమో? అని అన్నారు. నిజానికి చెప్పాలంటే టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ప్రతీ పథకానికి లంచం లేనిదే ప్రజలకు అందేవి కాదు. ఆ పథకానికి అర్హులు అయినవారు కూడా అధికారులు, మరియు నాయకుల కాళ్ళు పట్టుకుంటేనే పని చేసేవారు.
పిల్లల మధ్యాహ్న భోజనం, బాలికల సైకిళ్లు, చివరకు స్కూల్ విద్యార్థులకు ఇచ్చే బూట్లలో కూడా తెలుగు దొంగల పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారు. బాబు గారి పాలనలో బందిపోట్ల దోపిడీ లేని పథకమే లేదు. వీళ్లందరి నేరాలు రుజువైతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవేమో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 13, 2019