Home / ANDHRAPRADESH / ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచేప్పినా ఇంకా మారలేదా… ఏం మనుషులయ్య మీరు..?

ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచేప్పినా ఇంకా మారలేదా… ఏం మనుషులయ్య మీరు..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచినా తరువాత ప్రజలు మరియు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసాడు. దీనికి బాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న ప్రజలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరికీ సరైన బుద్ధి చెప్పాడు. అఖండ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి 100రోజులుదాటేసింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేయాలని ప్లాన్స్ వేస్తోంది.. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది..

ఎలాగో ఈ ఐదేళ్లు ప్రభుత్వానికి తిరుగుండదని టీడీపీ నేతలే భావిస్తున్నా ఆ విషయం చంద్రబాబుకు అర్ధం కావడం లేదు.. తండ్రికొడుకులు ఇద్దరూ ఈ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో వారు చేసిన అన్యాయాలు, అక్రమాలు గురించి మాట్లాడుకుంటే పేజీలు సరిపోవని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం సశ్యశామలంగా మారుతుందని ఈమేరకు సిఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. జగన్ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు సర్వత్రా హర్షం  వ్యక్తం చేస్తుంటే అది చూస్తూ తట్టుకోలేక తండ్రీకొడుకులు ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat