ప్రధానమంత్రి నరేందర్ మోదీ @3 కోట్లు అంటే డబ్బులు అనుకునేరేమో.. ప్రధాని మోదీ @3 కోట్లు అంటే మోదీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాడని విషయం తెల్సిందే. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ట్విట్టర్,ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రాం వాడతారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీని ఇన్ స్టా గ్రాంలో ఫాలో అయ్యేవారి సంఖ్య ఏకంగా మూడు కోట్ల మందికి చేరుకుంది. ప్రపంచ రాజకీయ నేతల్లో ఇన్ స్టాగ్రాం లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న నేతగా మోదీ నిలవడం విశేషం.
ఆ తర్వాత స్థానాల్లో అమెరికా మాజీ అధినేత బరాక్ ఒబామా(2.48కోట్ల మంది ఫాలోవర్స్), అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (1.49కోట్ల మంది ఫాలోవర్స్)నిలిచారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
అయితే మరో వైపు మోదీకి ట్విట్టర్లో 5.07 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక పాలోవర్లు గల ముగ్గురు ప్రముఖ నేతల్లో ప్రధాని మోదీ ఒకరని గాలప్ అంతర్జాతీయ సర్వే ఇటీవల పేర్కొంది.