బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండే అక్షయ్ కుమార్ తాజాగా బీహార్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకేశాడు.
రాష్ట్రంలో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన ఇరవై ఐదు కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ.1 కోటిని విరాళంగా ప్రకటించాడు. ఈ డబ్బుతో వారికి సాయం చేసి అండగా నిలబడాలమి అధికారులను హీరో అక్షయ్ కోరాడు.
సాటి మనుషుల జీవితాలను పునర్మించడం కోసం చేసే సాయం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అక్షయ్ చెప్పుతున్నాడు.