Home / ANDHRAPRADESH / జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!

జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప‌్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట‌‌్‌లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇటీవల డెంగ్యూ వచ్చినా జ్వరం, బాడీ పెయిన్స్‌ లాంటి లక్షణాలు కనిపించడం లేదు..ఈ క్రమంలో డెంగ్యూ వచ్చిన సంగతి పేషెంట్లకు తెలియదు..కాబట్టి వాళ్లు కనీసం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు. అయితే డెంగ్యూ జ్వరం రాకున్న వాళ్లలో ఇంటర్ననల్‌గా ప్లేట్‌లెట్లు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందంట..ఇలా జ్వరం, బాడీ పెయిన్స్ రాకుండా వచ్చే డెంగ్యూ వెరీ డేంజరస్. దీన్ని వైద్య పరిభాషలో ” అఫెబ్రిల్ డెంగీ ” అంటారు. ఈ అఫెబ్రిల్ డెంగీ అంటే జ్వరం కాని, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు కానీ లేకుండా డెంగ్యూ రావడం అని అర్థం..ఇలా జ్వరం రాకుండా డెంగ్యూ ఎక్కువగా షుగర్ పేషెంట్లకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఎటాక్ అవుతోంది. ఈ జ్వరం లేకుండా వచ్చే డెంగ్యూ ఎక్కువగా సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో వస్తుంది… ఈ జ్వరం లేని డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఊరికే అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం లాంటివి జ్వరం లేకపోయినా, సంభవిస్తున్నాయంటే, అది డెంగ్యూ కావచ్చు. వెంటనే ప్లేట్ లెట్స్ పరీక్ష చేయించుకోవడం బెటర్..ఆ నాకేం జ్వరంలేదుగా..జస్ట్ నీరసమేగా అని నిర్లక్ష్యం చేస్తే..ప్రాణాలు పోవడం ఖాయం..అందుకే జ్వరం లేకున్నా..ఈ లక్షణాలు మీలో ఉంటే..వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి ప్లేట్‌లెట్స్ టెస్టులు చేయించుకోండి…ఓకేనా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat