భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి.
కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే టీకాలు లభిస్తుండటం విశేషం..