ఉప్పెన`తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది. అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
తాజాగా మరో మంచి అవకాశం కృతి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కృతిని వరించినట్టు సమాచారం.
రామ్ హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ లింగు స్వామి ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.
తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం తాజాగా కృతిని సంప్రదించినట్టు సమాచారం. కథ నచ్చడంతో కృతి ఈ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.