కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్స్ జయరాం, జాచరయ్య, అడ్వైజర్ బ్రహ్మానందం, ప్రెసిడెంట్ అలక్జాండర్, వైస్ ప్రెసిడెంట్ రవివర్మ, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ, ట్రెజరర్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.