ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా టెస్ట్లు
జీరో నుంచి 16 నెలల్లో 2,00,39,764 టెస్ట్లు చేసిన రాష్ట్రం
కరోనా టెస్ట్లో ఏపీ బెస్ట్..దేశ సగటు కంటే మెరుగ్గా పరీక్షలు
ప్రతి 10 లక్షల జనాభాకు ఆంధ్రప్రదేశ్లో 3.75లక్షల పరీక్షలు చేయగా..
దేశ వ్యాప్తంగా 2.67 లక్షల టెస్ట్లు మాత్రమే జరిగాయి
2020 మార్చికి ముందు నమూనాలు..
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి
ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేనిస్థాయి నుంచి..
ప్రస్తుతం 14 ల్యాబొరేటరీలు
సెకండ్ వేవ్లోనూ సగటును రోజుకు 90వేల టెస్ట్లు
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ద్వారా సత్ఫలితాలు
రాష్ట్రంలో మొదటి వేవ్లో అత్యధికంగా ..
అక్టోబర్లో 22.39 లక్షల టెస్ట్లు జరగ్గా..
సెకండ్ వేవ్లో మే నెలలో 28.16 లక్షల టెస్ట్లు..
పాజిటివ్ కేసులు అత్యధికంగా 2020 సెప్టెంబర్లో..
2,55,096 నమోదయ్యాయి.
సెకండ్ వేవ్ మే నెలలో అత్యధికంగా 5,83,286 కేసులు నమోదయ్యాయి
ఏపీలో మొదటి వేవ్లో మృతుల శాతం 0.81 శాతంగా ఉండగా..
సెకండ్ వేవ్లో 0.51 శాతంగా ఉంది.
పాజిటివ్ కేసులు మొదటి వేవ్లో 6.37 శాతంగా ఉంటే…
సెకండ్ వేవ్లో 14.67 శాతంగా ఉంది.