దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా, 3,29,02,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
మరో 4,46,918 మంది కరోనా వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 26,032 మంది కొత్తగా వైరస్ నుంచి బయటపడ్డారని, 260 మంది మరణించారని తెలిపింది.
కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 16,671 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో మరో 260 మంది కన్నుమూశారని తెలిపింది. 68,42,786 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. దీంతో మొత్తంగా 85,60,81,527 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.