భోజనం చివర్లో ఒక్క ముద్దయిన పెరుగుతో తినాలంటారు. అది నిజమే ఎందుకంటే పెరుగు.. ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు తినాలి.
అయితే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే మంచిది. సాయంత్రం, రాత్రివేళ దీన్ని తీసుకుంటే జలుబు చేసే అవకాశం ఉంది. ఇక పెరుగులో ఉండే రైబోఫ్లావిన్, విటమిన్ బి6, బి12, కాల్షియం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారుతాయి.