కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిది మాటలెక్కువ.. పనితక్కువ సిద్ధాంతమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఏడేళ్లలో దేశంలో 153 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, (ఎంసీహెచ్), నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 30ు లోపు ఉన్న ప్రసవాల సంఖ్య ఇప్పుడు 52 శాతానికి పెరిగిందని, ఇందుకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి ప్రధాన కారణమని తెలిపారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం 23 ఆస్పత్రులను ప్రత్యేకంగా రూ. 407 కోట్లతో మంజూరు చేశామని, అందులో 13 ఆస్పత్రులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మరో 10 ఆస్పత్రులు వచ్చే ఐదు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.