తెలంగాణ రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ బైక్ లను వచ్చే రెండేండ్లలో ఈఎంఐ వాయిదాల పద్ధతిలో పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇందన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది.
ఇందులో భాగంగా తొలివిడతలో వచ్చే రెండు మూడు నెలల్లో 1000 ద్వి చక్రవాహానాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది . హైస్పీడ్ ,లోస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా కోసం తయారీదారుల నుండి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ఎలక్ట్రిక్ వైహికల్ ,ఎనర్జీ స్టోరేజీ సిస్టం పాలసీ-2020-30ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో,నగరాల్లో పెట్రోల్ డిజిల్ గ్యాస్ ఆధారిత వాహనాల స్థానంలో 2030నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమే ఈ పాలసీ లక్ష్యం .