గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కోమటిపల్లి ఇద్దరు, భీమారం 12మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14లక్షల 1వెయ్యి 624రూపాయల విలువగల చెక్కులను భీమారం లోని డివిఆర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు వర్దన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. అలాగే భీమారానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 70వేల 500రూపాయల విలువగల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గారు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.