ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రస్తుత అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 90 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.