పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలుగా కథ, దర్శకత్వం రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రాధే శ్యామ్.
ఈరోజు విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఏపీలో రాధే శ్యామ్ టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. అందులో భాగంగా ప్రీమియమ్ టికెట్ ధరను అదనంగా రూ.25లు పెంచుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.170కోట్ల భారీ వ్యయంతో నిర్మించినట్లు చిత్రం యూనిట్ పేర్కొన్నది.