తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీకి చెందిన అర్మూర్ ఎమ్మెల్యే ,పీయూసీ చైర్మన్ అశన్నగారి జీవన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు.
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు పద్దులపై జరిగిన చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు,రైతులకు సూపర్ హీరో అని ఆయన అభివర్ణించారు.
పాలించే పాలకులు మంచివాళ్లు.. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసే పాలకులైతే ప్రకృతి సహకరిస్తుంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిదర్శనం అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మిషన్ కాకతీయ ,రైతుబంధు,రైతు బీమా,రుణమాఫీ,ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలతో రైతులను కారుల్లో తిరిగేలా చేస్తుంది అని .. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్లతో రైతులను తొక్కిస్తుందని ఆయన అన్నారు.