తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులు తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలకర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,సబితా ఇంద్రారెడ్డి తో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర భేటీ అయ్యారు.
ఈ భేటీకి సీఎస్ సోమేష్ కుమార్,సీఎంఓ ఓఎస్డీ స్మితా సబర్వాల్,ఫైనాన్స్ కమిషనర్,ఫైనాన్స్ సీఎస్ లతో సహా పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. సుధీర్ఘంగా ఈ భేటీ జరుగుతూ ఉంది.
ఈ భేటీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెటులో సంక్షేమాభివృద్ధి పథకాలకు కేటాయింపుల ఖర్చులు,ఉద్యోగాల నోటిఫికేషన్స్,పీకే టీమ్ ఇటీవల నిర్వహించిన సర్వే అంశాలు,ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు మంత్రి కేటీఆర్ అమెరికా టూరులో ఉన్న సంగతి విధితమే.