Home / SLIDER / MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?

MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?

టీమిండియా లెజండరీ క్రికెటర్.. మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. టీమిండియాకు వరల్డ్ కప్ ను రుచి చూపించిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆలరిస్తున్న సంగతి విదితమే.  అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ నుండి తప్పుకుని బిగ్ షాకిచ్చిన ఎంఎస్ ధోనీ జట్టు ప్రయోజనాల కోసం అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడడు.

ఐపీఎల్ లో గత కొన్ని సీజన్లుగా CSKకి కెప్టెన్ గా రవీంద్ర జడేజాను తీర్చిదిద్దాడు ఎంఎస్ ధోనీ.ఇప్పుడు అకస్మాత్తుగా రవీంద్ర జడేజాకు చెన్నై బాధ్యతలను అప్పజెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజా ఐపీఎల్ సీజన్లో భాగంగా మొదటి మ్యాచ్ కు రెండు రోజుల ముందు ధోనీ తీసుకున్న ఈనిర్ణయం ప్రకటించడం విశేషం.

అయితే ప్రస్తుతం నలబై ఒకటో ఏటా అడుగుపెట్టబోతున్న ధోనీ ఫిట్ నెస్ కాపాడుకుంటూ వరుసగా అన్ని మ్యాచులు ఆడటం అనుమానమే అని అంటున్నారు క్రికెట్ క్రిటిక్స్.  తాజాగా నాయకత్వ బాధ్యతలను జడేజాకు అప్పజెప్పిన ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదని అంటున్నారు అందరూ. ఒకవేళ ఇదే నిజమైతే ధోనీ అభిమానులకు షాకింగ్ వార్తనే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat