కులవివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత ప్రయత్నం చేశారు. దళిత పూజారి స్వామి నారాయణ్ నమిలిన ఆహారాన్ని ఆయన తిని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజపేటలో చోటుచేసుకుంది.
అక్కడ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాల్లో స్వామి నారాయణ్కు ఎమ్మెల్యే జమీర్ఖాన్ తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత స్వామి నారాయణ్ ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోతే దానికి ఆయన నిరాకరించారు. నమిలిన ఆహారాన్ని తినిపించాలని నారాయణ్ను ఎమ్మెల్యే కోరారు. దీంతో ఆయన సగం నమిలిన ఆహారాన్ని ఎమ్మెల్యేకు తినిపిండంతో అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు.