కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలకు దిగారు. గత 8 ఏళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులపై ఎన్నిసార్లు ED, IT & CBI దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అంటే సత్య హరిశ్చంద్రుని బంధువులంతా బీజేపీకి చెందినవారేనా? అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
