దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు.
‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్పీజీ గ్యాస్ ధరలు అర్థం కావు.. ఇప్పుడు యువకులకు అగ్నివీర్ అర్థం కాదు.. కేవలం విశ్వగురుకు మాత్రమే వాటి అర్థం తెలిసి ఉంటుంది’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ట్విటర్లో సెటైరికల్గా పేర్కొన్నారు.