కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్పై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీలంక దేశంలో సంచలనం సృష్టించిన పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ – ప్రముఖ బడా పారిశ్రామికవేత్త అదానీ అవినీతి బంధంపై యావత్ భారతవాని దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్ స్కీమ్ను ప్రకటించరా? అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా బీజేపీ అండ్ కో ను ప్రశ్నించారు.
A Cabinet Minister of NPA Govt says #AgnipathScheme can result in youth being employed as Drivers, Electricians, Barbers & Washermen!
Yet another bright BJP leader says he will employ #Agniveers as security guards!
And you blame the youth that they don’t understand you Modi ji? https://t.co/PWjcaLwWQq
— KTR (@KTRTRS) June 20, 2022
ఇక అగ్నిపథ్ స్కీమ్ను సమర్థిస్తున్న కేంద్ర మంత్రులపై కూడా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం యువతకు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లు, వాషర్మెన్గా ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని మరో కేంద్ర మంత్రి చెప్పడాన్ని కూడా తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీని అర్థం చేసుకోలేదని మీరు యువతను నిందిస్తున్నారా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
Was #AgnipathScheme announcement just a ruse to divert India’s attention from #Srilanka allegations on Modi – Adani corruption nexus?#JustAsking
— KTR (@KTRTRS) June 20, 2022