Home / NATIONAL / ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్‌ సంచలన ఆరోపణలు

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్‌ సంచలన ఆరోపణలు

 కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్‌ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్‌ సహకరించారని ఆరోపించింది.

స్వప్నా సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన యూఏఈ జాతీయుడు జూన్ 30న కేరళకు చేరుకోగా, జూలై 4న సీఐఎస్‌ఎఫ్ అరెస్టు చేసింది. యూఏఈ కాన్సులేట్‌ అధికారుల నుంచి తనకు కాల్‌ వచ్చిందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపింది. తాను సీఎం కార్యదర్శి శివశంకర్‌రెడ్డితో మాట్లాడి మొత్తం విషయాన్ని చెప్పానని, ఆయన విజయన్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు.

ఆ తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు విడుదల చేశారని.. మళ్లీ ఈ విషయంలో విచారణ జరుగలేదని స్వప్నా ఆరోపించారు. అనుమానాస్పదంగా ఉన్న విదేశీ వ్యక్తికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పటికే కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కీలక నిందితురాలు స్వప్నా సురేష్‌. ఈ కేసులో ఇటీవల ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం ప్రమేయం ఉందంటూ ఆరోపించిన విషయం విధితమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat