తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలాజీ గణేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాలాజీ గణేశ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్కి తరలించారు.