Home / CRIME / ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి

ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన  చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్‌ దీక్షిత్‌ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు.

అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్‌ (35), అతని కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్ర సింగ్‌ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్‌ (45) ఉదయం ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన ఇరుగుపొరుగువారు వీరందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే రవీంద్రసింగ్‌, శివాంగ్‌, దివ్యాన్ష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోబ్రాన్‌, శివానందన్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, శివానందన్‌ భార్య వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకొని కలిపేసిందని. అది విషపూరితమై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తమ ద్యాప్తులో తేలిందని ఎస్పీ కమలేష్‌ దీక్షిత్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat