హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా అనే సాగుతున్న ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 34, బీజేపీ 30..ఇతరులు నాలుగు స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి.
నువ్వా నేనా అన్నట్లుగా అక్కడ రేస్ ఉన్నట్లు తెలుస్తోంది. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్లో చివరి ఫలితం ఎవర్ని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. హిమాచల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 35.