ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.
ఏపీ వార్షిక బడ్జెట్ -కేటాయింపులు
*సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ.29,690.71కోట్లు
*వైద్య ఆరోగ్య శాఖకు రూ. 15,882.34కోట్లు
*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,873కోట్లు
*ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్అబీకి రూ.9,118 కోట్లు
*నాడు- నేడు పథకానికి రూ.3,500కోట్లు
*ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు
*స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 1,166కోట్లు
*అమ్మఒడి రూ.6,500 కోట్లు
*ఎస్సీ కార్పొరేషన్ కు రూ.8,384.93కోట్లు
*ఎస్టీ కార్పొరేషన్ కు రూ.2,428 కోట్లు
* బీసీ కార్పొరేషన్ కు రూ.22,715 కోట్లు
*ఈబీసీ కార్పొరేషన్ కు రూ. 6,165 కోట్లు
*కాపు కార్పొరేషన్ కు రూ.4,887 కోట్లు
*క్రిస్టియన్ కార్పొరేషన్ కు రూ.115.03కో
*బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.346.78కోట్లు
*మైనారిటీ కార్పొరేషన్ కు రూ.1,868.25కోట్లు
* వ్యవసాయానికి రూ.11,589.48కోట్లు