దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా రోజూవారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7 వేలకుపైనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్మాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,171 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.