కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కౌంటింగ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీజేపీ కొనసాగుతోంది.
అయితే, చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోసం కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
రెండో స్థానంలో సుధాకర్ ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది.