Home / ANDHRAPRADESH / చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా..మీ దుంపతెగ..!

చరిత్రపురుషుడిని చెల్లని కాసు చేశారు కదరా..మీ దుంపతెగ..!

టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ ని చరిత్రపురుషుడిగా, యుగ పురుషుడిగా కొలుస్తుంటారు. అయితే అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆస్తులను లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి, పరోక్షంగా ఆయన చావుకు కారకులైనవారు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు వంత పాడిన స్వయాన ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు. నిజంగా నందమూరి కుటుంబసభ్యులకు చీమూ, నెత్తురు ఉంటే సవతి తల్లి లక్ష్మీ పార్వతి బూచిని చూపి తమ తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును క్షమించరు కానీ..నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యకరంగా  బాబుకు దాసోహం అంటుంది..ఆఖరికి చంద్రబాబుతో వెన్నుపోటుకు సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు, మరదలు పురంధేశ్వరీ కూడా ఇప్పుడు మళ్లీ నారావారి మాయలో పడి అందలం ఎక్కించిన బీజేపీకి ద్రోహం చేయడానికి సిద్ధమైంది.దీన్ని బట్టి…చంద్రబాబు తన నక్కజిత్తుల తెలివితేటలతో ఎవరినైనా బుట్టలో పడేస్తాడు..దీనికి నిదర‌్శనమే..ఎన్టీఆర్ 100 రూ. స్మారక నాణేం విడుదల కార్యక్రమం.

ఇప్పుడు చంద్రబాబుకు 2024 సార్వత్రిక ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి..తాను ఎన్ని రోడ్ షోలు చేసినా..సొంత పుత్రుడు పాదయాత్రలు చేసినా..దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఎన్ని రంకెలు వేసినా..కుల పత్రికలు, గుల మీడియా ఛానళ్లు జగన్ సర్కార్ పని అయిపోయిందని ఎంత పచ్చిగా ప్రచారం చేసినా ప్రజల్లో జగన్ కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు..పైకి పచ్చ మీడియా ప్రచారం చూసి జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని , ఏపీలో టీడీపీ ప్రభంజనం వీస్తుందని తాను గేట్లు తెరిస్తే..వైసీపీ ఎమ్మెల్యేలంతా ఫ్యాను కింద చల్లటి గాలి వదిలేసి సైకిలెక్కుతారని బిల్డప్పులు ఇస్తున్న బాబుగారు బీజేపీ ఎప్పుడు గేట్లు తీస్తుందా అని కాచుకు కూర్చున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోగానే తన కుల ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీలోకి పంపించిన చంద్రబాబు ఆ వెంటనే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ని బీజేపీతో చేతులు కలిపించి మళ్లీ మోదీ ప్రాపకం కోసం పాకులాడాడు..అయితే బీజేపీ ఛీ పొమ్మనడంతో దిక్కుతోచని చంద్రబాబు ఇప్పుడు తన మరదలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీని మళ్లీ దగ్గరకు తీశాడు….ఎంత కాదనుకున్నా…చంద్రబాబు తమ బంధువు..అధికారం కమ్మగా మా చేతిలో ఉండాలె తప్పా..ఇంకెవరికి ఉండకూడదని భావించిన చిన్నమ్మ చంద్రబాబు కపట ప్రేమకు లొంగి సొంత పార్టీని మళ్లీ టీడీపీకి తాకట్టు పెట్టేసేందుకు రెడీ అయిపోయింది..

వెంకయ్యనాయుడి కాలంలో బీజేపీ టీడీపీకి తోకపార్టీగా మారింది..ఇప్పుడు పురంధేశ్వరీ కూడా సేమ్ బీజేపీని టీడీపీతో గాట కట్టేందుకు సిద్ధమైంది..అందులో భాగమే ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల…మింట్ లో డబ్బులు కట్టిన ఓ 14  వేల  స్మారక నాణేలు అచ్చువేయించిన పురంధేశ్వరీ తన పార్టీ మనిషి అయిన రాష్ట్రపతి గారిని బతిమాలుకుని ప్రైవేట్ కార్యక్రమాన్ని కాస్తా…అధికారిక కార్యక్రమంగా మార్చి ప్రజలను ఏమార్చింది..అమాయకులైన నందమూరి కుటుంబసభ్యులు అబ్బో..చూశారా మానాన్నారి గొప్పతనం..చరిత్రపురుషుడికి కేంద్రం ఇస్తున్న గుర్తింపు అంటూ మురిసిపోయి అందరూ బాబుగారితో కలిసి ఢిల్లీకి వెళ్లి..స్మారక నాణేం విడుదల కార్యక్రమంలో పాల్గొని తెగ సంతోషపడిపోయారు.

అయితే ఇక్కడ చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ముచ్చటించి…ఆ ఫోటోలను సీఎం రమేష్ తో తీయించి  మీడియాకు విడుదల చేయించాడు…ఇంకేముంది…టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఇక జగన్ చిత్తు అంటూ పచ్చ మీడియా పిచ్చెక్కినట్లు బ్రేకింగ్ న్యూస్ లతో వూదరగొట్టింది..అయితే కేంద్రం మాత్రం చావు కబురు చల్లగా చెప్పింది.. ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడంతో ఎన్టీఆర్ సతీమణి అయిన లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరీ, పురంధేశ్వరీ అసలు విలన్లు అంటూ కడిగిపారేసింది…తనను ఎన్టీఆర్ భార్యగా గుర్తించకపోతే…ఎన్టీఆర్ యుగపురుషుడు, చరిత్రపురుషుడు ఎలా అవుతాడంటూ బాబు, పురంధేశ్వరీలను కలిసి మడతట్టేసింది..

ఎన్టీఆర్  స్మారక నాణెం కార్యక్రమం వివాదం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి..ఇది అధికారిక కార్యక్రమం కాదు..పురంధేశ్వరీ నిర్వహించుకున్న ప్రైవేట్ కార్యక్రమం అంటూ తేల్చి చెప్పింది..అంతే కాదు..ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కేవలం స్మారకం మాత్రమే అని మారకం కాదని..అంటే బహిరంగ మార్కెట్ లో చెల్లవని…4 వేల కు ఎన్టీఆర్ గుర్తుగా ఎవరైనా కొనుక్కోవచ్చు అని అమ్మకానికి పెట్టింది..దీంతో నందమూరి అభిమానులకు దిమ్మతిరిగినట్లైంది…బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయంలో పురంధేశ్వరీ, బాలయ్య తదితరులు భాగమై…ఇలా చరిత్రపురుషుడు అయిన ఎన్టీఆర్ ని  కాస్తా చెల్లని నాణేంగా మార్చారు కదరా..మీ దుంప తెగ అంటూ నిజమైన నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ఆడుతున్న క్రీడలో పురంధేశ్వరీ, బాలయ్య, నందమూరి కుటుంబసభ్యులు భాగం కావడం దారుణాతి దారుణం..ఒక్క జూ. ఎన్టీఆర్ కు చంద్రబాబు నక్కజిత్తుల తెలివితేటలు తెలుసు కాబట్టే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండి..తన విజ్ఞతను ప్రదర్శించాడు..ఎన్టీఆర్ లాంటి చరిత్ర పురుషుడిని తమ రాజకీయ స్వార్థం కోసం చెల్లని కాసుగా మార్చిన చంద్రబాబును, ఫురంధేశ్వరీని తెలుగు ప్రజలు ఎప్పటికీ క్షమించరు…ఇది సత్యం..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat