కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ గండి మైసమ్మ డి.పోచంపల్లి లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో గుర్రాల శ్రీకాంత్ రెడ్డి వారి బృందం సుమారు 500 మంది యువకులు, మహిళలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలిచావులు ఉండేవని, నేటి కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు మూడుపూటలు కడుపు నింపుతున్న ఘనగ సీఎం కెసిఆర్ గారికే దక్కిందన్నారు., సంక్షేమమే అభివృద్ధిగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజా సంక్షేమం కోసమే పాలన సాగించే బిఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.
బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారు : నిఖిల్ రెడ్డి, శ్రీకర్, ఉపేందర్, సాయి, అభిలాష్, మహేష్, శ్రీను, రాజు, వేణు, అంజి, నాగబాబు …..ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మల్లేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి యాదవ్, స్థానిక కౌసెల్లోర్లు శంబీపూర్ కృష్ణ, సాయి యాదవ్, మహేందర్ యాదవ్, జక్కుల కృష్ణ యాదవ్, భరత్, ఆనంద్, విష్ణు, సురేందర్ రెడ్డి, రాజశేఖర్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, కొల శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.