కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు గురువారం సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్ఎస్ ఆధ్వరంలో చేపట్టిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్కు దక్కుతుందన్నారు. తెలంగాణ లో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారని… ధాన్యం సేకరణపై మాత్రం మాట్లాడ్డం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ మనం రోడ్లు ఎక్కడం అని తెలిపారు. జీడీపీ పెంచమని అంటే… గ్యాస్ , డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాకు సిగ్గు ఉండాలని వ్యాఖ్యలు చేశారు.