అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్సిం గ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …
Read More »నక్క తోక తొక్కనున్న పూజా హెగ్దే
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితులన్నీ సర్దుకున్నాకే ఆ సినిమా ఉంటుందని గుణశేఖర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ లోపు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ కవి కాళిదాసు రచన ఆధారంగా `శాకుంతలం` సినిమాను తెరకెక్కించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్తో తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.
Read More »నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ రోజు మంగళవారం మొదలుకానున్నది. ఇటీవల ప్రారంభమైన శాసన సభ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. ఈ రోజు మొదలు కానున్న ఈ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించే విధంగా బిల్లును తీసుకురానున్నది. నాలా చట్టం ,నేర విచారణ స్మృతి వంటి పలు ప్రత్యేక చట్టాలకు ప్ర్తభుత్వం పలు సవరణలను …
Read More »వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ …
Read More »విభిన్న పాత్రలో హాట్ యాంకర్
బుల్లితెరపై తన అందచందాలతో యాంకరింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పిన హాట్ బ్యూటీ అనసూయ. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించడం మొదలెట్టి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది ఈముద్దుగుమ్మ. అప్పుడప్పుడు ఎంట్రీ సాంగ్స్ తో కూడా ఈ హాట్ బ్యూటీ అలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ విభిన్న పాత్రలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించబోతున్న …
Read More »జియో సంచలనం
టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం …
Read More »మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?
మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు. ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం …
Read More »బీజేపీ మంత్రి మృతి
ప్రస్తుతం దేశంలో కరోనా మమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజు సుమారు డెబ్బై వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీహార్ కి చెందిన మంత్రి,బీజేపీనేత వినోద్ కుమార్ మృతి చెందారు. అయితే గత జూన్ నెలలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరారు. …
Read More »