హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పుతున్నట్టు …
Read More »తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ షాక్
తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి …
Read More »ముకేశ్ అంబానీ సంపద రూ.6,49,639 కోట్లు
ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …
Read More »అంబానీ సంచలన నిర్ణయం
ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …
Read More »60వేలకు దగ్గరలో బంగారం
అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం సోమవారం ఏకంగా రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరిగి రూ.49,780కి చేరింది. అటు కిలో వెండి ధర ఏకంగా రూ.3,490 పెరిగి రూ.64,700కి చేరింది.
Read More »రికార్డు స్థాయిలో డీజిల్ ధరలు
డీజిల్ ధరలు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచారు.గత మూడు వారాల్లో డీజిల్ ధర పెరగడం ఇది 22వ సారి. దీంతో లీటరు డీజిల్పై రూ.11.14 పైసలు పెరిగాయి. సోమవారం రోజున లీటరు పెట్రోల్పై 5 పైసలు, డీజిల్పై 13 పైసలు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 80.43పైసలు కాగా, లీటరు డీజిల్ ధర 80.53 పైసలుగా …
Read More »దేశంలో పెట్రోల్ మంట
దేశంలో పెట్రోల్ ధర పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్పై 56 పైసలు, డీజిల్పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 …
Read More »చైనా మాస్కులపై వెలుగులోకి సంచలన విషయం
కరోనా మహమ్మారి మొదటిగా చైనాలో వ్యాప్తిచెందిన సంగతి విదితమే.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ భారీన పదహారు లక్షల మంది పడ్డారు.ఈ క్రమంలో చైనా మాస్కులంటేనే ప్రపంచ దేశాలు గజగజవణుకుతున్నాయి. తాజాగా కరోనా నియంత్రణ వైద్య సిబ్బంది కోసం చైనా నుండి తెప్పించుకున్న మాస్కులు సురక్షితం కాదు అని ఫిన్లాండ్ తేల్చి చెప్పింది.మాస్కులు నిర్ణీత రక్షణ ప్రమాణాలను పాటించి ఆ మాస్కులను తయారుచేయలేదు అని ఆ దేశం ప్రకటించింది. చైనా …
Read More »గత మార్చి బిల్లు కట్టండి చాలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్లైన్ ద్వారా కడితే సరిపోతుందని కస్టమర్లకు తెలియజేసింది. గత మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్ల ద్వారా కస్టమర్లకు పంపిస్తాయని, దాని ప్రకారం ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే చాలని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …
Read More »ఆకాశాన్నంటిన మద్యం ధరలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …
Read More »