Breaking News
Home / NATIONAL / దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది.

ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.50శాతం, వ్లీకీ పాజిటివిటీ రేటు 4.69శాతం, రికవరీ రేటు 98.51శాతంగా ఉందని మంత్రిత్వశాఖ వివరించింది.

గత 24గంటల్లో 3,63,855 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటి వరకు 87.52 కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతున్నది. 206.88కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino