Home / SLIDER (page 248)

SLIDER

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ సినిమా షూటింగ్పై అప్డేట్ వచ్చింది. రేపటి నుంచి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెట్స్ లో ప్రభాస్ షూటింగ్లో పాల్గొననున్నాడు. సుదీర్ఘకాలం పాటు షూటింగ్ షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం. అయితే, సంక్రాంతికి ‘సలార్’ నుంచి అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను   మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉన్నాయి.. అయితే వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. ఈ నెల 19న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది.

Read More »

రాహుల్ యాత్రలోఅనుకోని అతిథి..?

 గత ఎనిమిదేండ్లుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భార‌త్ జోడో యాత్ర హర్యాణా రాష్ట్రంలో కొనసాగుతోంది.బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో రాహుల్‌గాంధీ గత సెప్టెంబర్‌ 7న భారత్‌ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా అక్కడ అనుకోని అతిథి ఈ యాత్రలో పాలుపంచుకుంది. విదేశీ జాతికి చెందిన …

Read More »

రూ.56 కోట్లతో సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలు మార్లు అసెంబ్లీ వేదికగా.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు మంత్రి శ్రీ కేటీఆర్ గారు స్పందించారు. ప్రత్యేక జీఓ నెంబర్ 892 ద్వారా రూ.56 కోట్ల నిధులు మంజూరు …

Read More »

బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్‌ గుర్తించాడు. దాంతో తిరిగి మళ్లీ ఒంగోలులోనే ల్యాండింగ్‌ చేశాడు. ప్రస్తుతం టెక్నీషియన్స్‌ లోపాన్ని సవరించేపనిలో ఉన్నారు. ఇక శుక్రవారం జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఇదే హెలికాఫ్టర్‌లో బాలయ్య ఒంగోలుకు వచ్చాడు.

Read More »

వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం ఫిక్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి. ఎందుకంటే దర్శకుడిగా బాబీకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయితే చిత్రబృందం …

Read More »

రైతుబంధు నిధులను రైతులకే ఇవ్వాలి

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద‌ జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్​​రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల ఖాతాలకు రావడం లేదన్న క‌థ‌నాల‌పై హ‌రీశ్‌రావు స్పందించారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని మంత్రి ఆదేశించారు. రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు …

Read More »

Politics : కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు ఉందా.. మంత్రి అంబటి

Politics టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన పై విమర్శలు గుప్పించారు.. నా కుప్పం అంటున్న చంద్రబాబుకు.. కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా అని  ప్రశ్నించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు అలాగే ఈ సందర్భంగా.. ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 …

Read More »

Politics : న్యూస్ ఛానెల్స్ వారి స్వార్థం కోసమే పనిచేస్తున్నాయి.. ఆంధ్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

Politics ఈ రోజుల్లో జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియకుండానే కొందరు న్యూస్ రాస్తున్నారని మరికొందరు కేవలం వారి స్వార్థం కోసమే న్యూస్ ఛానల్లో నడుపుతున్నారు అంట చెప్పుకోచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా జర్నలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈయన కొందరు జర్నలిజం విలువకు తిలోదకాలు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అలాగే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat